నల్లగొండ : ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం సత్ఫాలితాలు సాధిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడమే అందుకు కారణమని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ముందు చూపు నిర్ణయాలు సత్ఫాలితాలు ఇస్తున్నాయన్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే బోధ పడుతున్నాయని చెప్పారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రాజన్నగూడెం సింగిల్ విండో చైర్మన్, సీనియర్ టీఆర్ఎస్ నేత కేవీ రామారావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతం : మంత్రి నిరంజన్ రెడ్డి