అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 204 మంది చికిత్సకు కోలుకున్నారు. కర్నూల్, ప్రకాశం జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8,93,366కు చేరింది. 8,84,094 మంది కోలుకోగా.. మరో 2083 యాక్టివ్ కేసులున్నాయి. 7189 మంది మృతి చెందారు.