ఇందూరు, జూన్ 28 : జిల్లా కేంద్రంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అర్బన్, రూర ల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గో వర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ విఠల్రావుతో కలిసి సోమవారం పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణమంతా కలియతిరిగి హెలిప్యాడ్ స్థలాన్ని, మొక్కలను పరిశీలించారు. కలెక్టరేట్ భవనంలో వివిధ విభాగాల కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను పరిశీలించారు.
త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభం
కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచన లు చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకే గొడుగు కిందకు జిల్లాలోని అన్ని కార్యాలయాలతో సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మిస్తున్నారన్నారు. సమీకృత భవనంలో 28 విభాగాల కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి కలెక్టరేట్లో మంత్రుల కో సం ‘స్టేట్ చాంబర్’ ఏర్పాటు చేయాల ని సీఎం ఆదేశించారని తెలిపారు. మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సమీక్షలు నిర్వహించుకునే ఏర్పాట్లు చేయాలని సూచించారన్నారు. ప్రజల మేలు కోసం ఇంతటి గొప్ప ఆలోచన కేసీఆర్ మాత్రమే చేశారన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.కలెక్టరేట్ వరకు మున్సిపల్ కార్పొరేషన్, నుడా నిధులతో డబుల్ రోడ్డు వేయించినందుకు అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలతో పాటు నుడా చైర్మన్కు మంత్రి కృతజ్ఞత లు తెలిపారు. వారి వెంట కలెక్టర్ నారాయణరెడ్డి,అధికారులు,ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.
ఎంపీ అర్వింద్ స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నాడు..
మాధవనగర్ ఆర్వోబీ విషయంలో ఎంపీ అర్వింద్ తన స్థాయిని దిగజారి వ్యవహరిస్తున్నాడని మంత్రి ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆర్వోబీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని అంశమైనా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. కేంద్రం కేవలం 30 కో ట్లు మాత్రమే ఇస్తున్నదన్నారు. బ్రిడ్జి కోసం అర్వింద్ ధర్నా చేయడం ఓ డ్రామాగా అభివర్ణించారు. కేంద్రం నుంచి నిధులు తేవాల్సి న ఎంపీ అర్వింద్ పనికి మాలిన వేషాలు వే స్తూ.. ప్రజలను పక్కతోవ పట్టిస్తున్నాడన్నా రు. మాధవనగర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు ఆర్వోబీల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, త్వరలోనే వీటికి సంబంధించిన చర్యలు చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు.