జమ్మికుంట, మే 20: తన వ్యక్తిగత విషయాలను ఈటల రాజేందర్ రాజకీయం చేస్తున్నారని, ఉద్యమ గడ్డగా పేరుగాంచిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను ఆగం పట్టిస్తున్నారని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. అటు సీఎం కేసీఆర్కు, ఇటు ప్రజలకు దూరమైన ఈటల, తాను తవ్వుకున్న గొతిలోనే పడ్డారని అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో ఎవరినీ సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక్కడి నాయకులకు, ప్రజాప్రతినిధులకు దూరమయ్యార అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ వెంటే ప్రజలుంటారని పేర్కొన్నారు. కేసీఆరే తమ నాయకుడని స్పష్టంచేశారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు మల్లయ్య, శ్రీలత, కళావతి, రాము, సారంగం, పూలమ్మ, రాజయ్య, లావణ్య, శ్రీనివాస్, వీరన్న, భిక్షపతి, రాధ, అరుణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.