రంగారెడ్డి : ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం ఆగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సిరిగిరిపురం గ్రామానికి వెళ్తూ మార్గమధ్యంలో ఆగారు. మహేశ్వరం సమీపంలో ఉపాధి హామీ పథకం కింద మొక్కలను నాటుతున్న ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి రోజూ ఎంత కూలి చెల్లిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. 245 రూపాయలు చెల్లిస్తున్నరని కూలీలు తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 54 లక్షల 4 వేల జాబ్ కార్డులు ఉన్నాయని మంత్రి తెలిపారు. 40,598 జాబ్ కార్డులు కొత్తగా మంజూరు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా చురుగ్గా ఉపాధి పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి