జగిత్యాల అర్బన్, మార్చి 30: పట్టణంలోని 5, 21, 22, 37 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు గంగసాగర్, గుగ్గిల్ల హరీశ్, పులి రమ, డీఈ లచ్చిరెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్ఫార్మర్ మార్పిడి
యావర్ రోడ్డులో ప్రధాన రహదారి పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ మార్పు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి మంగళవారం ప్రారంభించారు. కొత్త బస్టాండ్ సర్కిల్, మున్సిపల్ పార్క్, అటవీ శాఖ కార్యాలయం, అంగడి బజార్ ప్రాంతా ల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మార్చే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, డీ హరికృష్ణ, ఏడీఈ జవహర్నాయక్, ఏఈలు అశోక్రెడ్డి, సత్యనారాయణ, రహీం, డీఎఫ్వో వెంకటేశ్వర్, మున్సిపల్ డీఈ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతి పత్రం అందజేత
జగిత్యాల రూరల్, మార్చి 30: పట్టణంలోని భూములను పార్క్ జోన్ నుంచి కమర్షియల్, నాన్ కమర్షియల్ జోన్లోకి మార్చాలని కోరుతూ పట్టణానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సంజయ్కుమార్కు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కౌన్సిలర్ బాలె లతా శంకర్, ముజాహిద్, రాజ వెంకటనర్సింగరావు, గొల్లపెల్లి శివప్రసాద్, సీహెచ్ ఆశాలు, జీ పద్మ, తదితరులున్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
పట్టణానికి చెందిన పుల్లూరి సత్యనారాయణ తల్లి కౌసల్య, మేడిశెట్టి మహేశ్ తండ్రి లక్ష్మీనారాయణ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ బొడ్ల జగదీశ్ పాల్గొన్నారు.