సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీక అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ సర్వ మతాల సమ్మేళనమన్నారు. భిన్న మతాల సంస్కృతులు, సంప్రదాయాల ప్రజలను తన అక్కున చేర్చుకొని ఆదరిస్తుందన్నారు.
అందరిని ఆదరించే గొప్పగుణం ఈ గడ్డదన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే రంజాన్కు ప్రభుత్వ గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తారని తెలిపారు. పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే రంజాన్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే