హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు తెలంగాణ రాష్ట్రం ఘనంగా నివాళులర్పించింది. బుధవారం అంబేద్కర్ 130వ జయంతిని పండుగలా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నది. అంబేద్కర్ ఒక కులానికో, ఒక మతానికో సంబంధించిన వ్యక్తికాదని, ఆయన యావత్ భారతదేశానికి ఆదర్శనీయుడని శాసససభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ భానూప్రసాద్, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, టీఆర్ఎస్ అసెంబ్లీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఘన నివాళులర్పించారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున త్వరలోనే 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఖమ్మంలో 14 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి అజయ్కుమార్ బుధవారం ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలోని అంబేద్కర్ సెంటర్లో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎంపీ నామా ఆవిష్కరించారు. మహబూబ్నగర్లోని బస్టాండ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అటవీశాఖ కేంద్ర కార్యాలయంలో అటవీ, పర్యావరణశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి.. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరీంనగర్, సిరిసిల్ల పట్ణణంలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. కరీంనగర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చిట్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్షీరాభిషేకం చేశారు.