లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6గంటలకు సిటీ బస్సులు రోడ్డెక్కాయి. తిరిగి 10గంటలకు డిపోలకు చేరుకున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని 29డిపోల్లో 2,700 వరకు సిటీ బస్సులు ఉన్నాయి. ప్రతిరోజూ 2,500 వరకు వివిధ మార్గాల్లో తిరుగుతున్నాయి. మరికొన్నింటిని అవసరాలకు అనుగుణంగా డిపోల్లో సిద్ధంగా ఉంచుతున్నారు. కాగా, నైట్ కర్ఫ్యూతో రాత్రి 9గంటల వరకు సర్వీసులను ముగించే వారు. తాజాగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో తొలిరోజు బుధవారం ఒక ట్రిప్పుతో దాదాపు 800లకు పైగా బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మిగతా రోజుల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడుపుతామన్నారు. వైద్యసేవలు అందిం చే వారితో పాటు శానిటేషన్ వర్కర్లు, జీహెచ్ఎంసీ వర్కర్ల కోసం కొన్ని బస్సులను నడిపించాల్సి వస్తుందన్నారు.