డీఆర్డీఏ పీడీ కాళిందిని
మక్తల్ రూరల్, మే 28 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని నారాయణపేట జిల్లా డీఆర్డీఏ పీడీ కాళిందిని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మక్తల్ మండలంలోని పంచదేవ్పాడ్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది చేపట్టిన పల్లె ప్రగతి పనులను వారంలోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటుంన్నామన్నారు. ఇందులో భాగంగానే ఆయా గ్రామాల్లో పెండింగ్ పనులను పరిశీలించామన్నారు. ప్రస్తుతం కొవిడ్ ప్రభావం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రభావం పడిందన్నారు. పల్లె ప్రగతిలో చేపట్టిన ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, హరితహా రం, అంతర్గత ర హదారులు వంటి పనులను చే పట్టామన్నారు. అనంతరం గ్రామంలో పల్లె ప్రగ తి పనుల పురోగతి గురించి సర్పంచ్ కల్పనాకృష్ణాచారిని విచారించారు. ఇంతవరకు పార్కు, హరితహారం కింద చేపట్టిన నర్సరీ పనులు పూర్తయ్యాయన్నారు. కాగా శ్మశాన వాటిక పనులు జ రుగతున్నాయని వివరించారు. ఆయా పనులను పీడీ తనఖీ చేశారు. పనులు దాదాపు 90శాతం పూర్తి కావడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మిగి తా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్గౌడ్, ఏపీవో శంకర్, సర్పంచ్ కల్పనాకృష్ణాచారి, పంచాయతీ కార్యదర్శి వీరేశ్, గ్రామస్తులు నరసింహాచారి, వెంకటేశ్ పాల్గొన్నారు.