హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పండే వేరుశనగ దేశంలోనే అత్యుత్తమమైదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అఫ్లాటాక్సిన్హ్రిత పల్లీ ఒక్క మన రాష్ట్రంలోనే పండుతుందని చెప్పారు. ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ గుజరాత్లో వేరుశనగను సాగుచేస్తున్నారని.. తెలంగాణలోనూ రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని సూ చించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మంత్రి నిరంజన్రెడ్డి సోమవారం వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించారు. అక్కడి రైతులతో ముచ్చటించారు. యాసంగిలో వేరుశనగ సాగుకు అనుకూల పరిస్థితులున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేరుశనగ సాగు పెరిగితే.. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గుజరాత్లో గత వానకాలంలో 54 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేయగా.. 56 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్టు తెలిపారు. తెలంగాణ రైతులు వరి సాగును తగ్గించి.. ఇతర పంటల సాగుపై దృష్టిపెట్టాలని కోరారు. కార్యక్రమంలో గుజరాత్ ఉద్యానశాఖ జేడీ చావ్డా పాల్గొన్నారు.