ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇద్దరు కొత్త పెళ్లి కొడుకులు చెబుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. ఒకరు నితిన్.. మరొకరు రానా దగ్గుబాటి. అసలే గతేడాది కరోనా కారణంగా మన హీరోలు భారీగా బాకీ పడిపోయారు. ఇప్పుడు ఆ బాకీ అంతా ఒకేసారి తీర్చాలని రెడీ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే 30 రోజుల వ్యవధిలో రెండు సినిమాలు విడుదల చేస్తున్నారు ఈ హీరోలు.
ఇప్పటికే ఫిబ్రవరి 26న నితిన్ నటించిన చెక్ సినిమా విడుదలైంది. ఈ సినిమా వచ్చిన సరిగ్గా నెల రోజులకు అంటే మార్చి 26న రంగ్ దే సినిమా విడుదల అవుతుంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్టర్ మజ్ను లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత వెంకీ నుంచి వస్తున్న చిత్రమిది. అలా నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలు విడుదల చేస్తున్నాడు నితిన్.
మరోవైపు రానా దగ్గుబాటి కూడా ఇదే చేస్తున్నాడు. నాలుగేళ్లుగా రానా నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. 2017 లో బాహుబలి 2 వచ్చిన తర్వాత అనారోగ్యం పాలయ్యాడు రానా. అలా రెండేళ్లు ఊరికే గడిచిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత ఆయన అరణ్య సినిమాతో వస్తున్నాడు. మార్చి 26న ఈ సినిమా విడుదల కానుంది. సరిగ్గా అరణ్య విడుదలైన నెల రోజుల తర్వాత విరాటపర్వం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రానా దగ్గుబాటి.
సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాలుగేళ్ల కిందట నీది నాది ఒకే కథ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రెండు సినిమాలతో మళ్లీ తానేంటో నిరూపించుకుంటాను అంటున్నాడు రానా. మరోవైపు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మల్టీస్టారర్ కూడా 2021లోనే విడుదల కానుంది. ఏదేమైనా కేవలం 30 రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల చేయడం అనేది ఈ రోజుల్లో అంత చిన్న విషయం కాదు. కానీ దాన్ని చేసి చూపిస్తున్నారు మన హీరోలు.