హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పీఆర్సీ అమలు, పదోన్నతులు, మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. పదోన్నతులకు సర్వీస్రూల్స్ సడలింపు వంటివి అమలు చేస్తున్నది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా వ్యవహరిస్తున్నది. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమరంగంపై చర్చ సందర్భంగా ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..