స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఈ నెల 27న అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఈ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.