పెండ్లంటే మేళతాళాలు.. బాజాభజంత్రీలు.. మూడు ముళ్లు, ఏడు అడుగులు.. ఇప్పటిదాకా ఇంతే. కానీ, కరోనా రాకతో ముఖాలకు మాస్కులు, షీల్డులు, స్వాగత ద్వారం వద్దే శానిటైజర్లు.. ఇలా మరెన్నో చేరాయి. రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పెండ్లిళ్లు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం ఒకరి వివా హం ఆర్బాటం లేకుండా సాగింది. పండితుడు, పెండ్లి కుమారుడు, పెండ్లి కూతురు మాస్కులు ధరించడంతోపాటు భోజనాల కోసం అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. భౌతికదూరం పాటిస్తూ ఏర్పాట్లుచేశారు.