కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించే కార్యక్రమంలో సెలబ్రిటీలు భాగస్వామ్యమవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బుర్రిపాలెంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మొదలుపెట్టాడు. ఇపుడు యాక్టర్ నిఖిల్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నాడు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం నిఖిల్ ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించాడని సమాచారం.
సోషల్ మీడియా సాయంతో అవసరమైన వారికి సాయం చేయనుంది నిఖిల్ అండ్ టీం. ఎస్వోఎస్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయిన వారికి సాయమందించనున్నారు. ఫస్ట్ డోస్ వేయించుకొని సెకండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్న వారికి వ్యాక్సిన్ వేయనుంది నిఖిల్ టీం. త్వరలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు నిఖిల్ చెప్పాడు. నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలు చేస్తున్నాడు నిఖిల్.
ఇవి కూడా చదవండి..
పవన్కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్సాబ్ డైరెక్టర్ తో నాని..!
Recommended Content by ntnews.com