హైదరాబాద్ : రాష్ట్రంలో రేపటి నుంచి వచ్చే నెల 14 వరకు పాస్పోస్టు సేవలు నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం పాస్పోర్టు సేవలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని 14 తపాలా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పాస్పోస్టు సేవలను అందిస్తున్నది. తాజా నిర్ణయంతో ఇవన్ని గురువారం నుంచి మూతపడనున్నాయి.
విషయాన్ని గమనించి దరఖాస్తు దారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మే 14 తరువాత పరిస్థితులకు అనుగుణంగా పాస్పోర్టు సేవాలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి