సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 2,048 రేషన్ దుకాణాలున్నాయి. ఈ రేషన్ దుకాణాల ద్వారా పేద ప్రజలకు రేషన్ సరుకులను ప్రతి నెలా ప్రభుత్వం అందిస్తున్నది. గతంలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి కార్డు మంజూరు చేయాలని గత నెల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జిల్లాల వారీగా ఎంత మంది రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంత మంది అర్హులున్నారు అనే లెక్కలను తీసి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. త్వరలోనే అర్హులైన వారందరికీ రేషన్కార్డు అందించడంతో పాటు ఈ నెల నుంచే కొత్త కార్డుదారులకు రేషన్ బియ్యం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జిల్లాలకు రేషన్ బియ్యం కోటాను సైతం కేటాయించింది. దీంతో జిల్లాలో రేషన్ దుకాణాల వారీగా అర్హుల కార్డులను సిద్ధం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో రేషన్ కార్డుల కోసం 6,581 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, వీటిలో 5,627 కార్డులకు అనుమతివచ్చింది.
ఈ జిల్లాలో 680 రేషన్ షాపులున్నాయి. 2,87,879 రేషన్ కార్డులున్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు 2,68,989 ఉండగా, అంత్యోదయ కార్డులు 18,790. అన్నపూర్ణ కార్డులు 93 ఉన్నాయి. ప్రతి నెలా 5,771 టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. మెదక్ జిల్లాలో 3513 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, వీటిలో 3,220 కార్డులకు అనుమతులొచ్చాయి. ఈ జిల్లాలో మొత్తం 521 రేషన్ షాపులుండగా, ఆహార భద్రత కార్డులు 1,99,492, అంత్యోదయ కార్డులు 13,805, అన్నపూర్ణ కార్డులు 75 మొత్తం జిల్లాలో ఉన్న కార్డులు 2,13,372 ఉన్నాయి. ప్రతినెలా 4,514 టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 10,217 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా 7,627 కార్డులకు అనుమతులొచ్చాయి. ఈ జిల్లాలో 847 రేషన్ దుకాణాలుండగా 3,72,364 కార్డులున్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు 3,45,433 ఉండగా, అంత్యోదయ 27,127, అన్నపూర్ణ 104 కార్డులున్నాయి. ప్రతి నెలా 12,371 టన్నుల రేషన్ బియ్యం ప్రతినెలా లబ్ధిదారులకు అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ అర్హులైన పేదవారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా బియాన్ని సరఫరా చేస్తున్నది. దీంతో నిరుపేదల ఆకలిని రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది.