హైదరాబాద్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.