హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 75 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెండింగ్లో ఉన్న గ్రామీణ రహదారుల నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించింది. వీటి నిర్వహణకు నిధులు విడుదల చేసి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నది.