హైదరాబాద్ : రాష్ట్రంలో పత్తి సాగును తెలంగాణ ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు. పత్తిసాగు విస్తీర్ణంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కానీ సగటు ఉత్పత్తిలో తెలంగాణదే అగ్రస్థానమని ఆయన తెలిపారు. పత్తి సాగు విస్తరణపై సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారని వెల్లడించారు. సోమవారం జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిన్నింగ్ మిల్లులకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తాం. మరిన్ని రాయితీలు ఇచ్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తిని రైతులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.