రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగం టెక్స్టైల్ . ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,573 హ్యాండ్యూమ్స్ నడుస్తుండగా 41వేల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 38,262 పవర్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. నేతన్నలను ఆదుకునేందుకు ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పేరుతో పొదుపు పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 20,537 మందికి రూ.96.43 కోట్లను పంపిణీ చేసింది. చేనేత మిత్ర స్కీమ్ కింద నూలు కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఇప్పటివరకు 77 వేల కొనుగోళ్లపై రూ.11.57 కోట్ల మేర ప్రయోజనం కలిగించింది.