హైదరాబాద్ : సింగూర్ ప్రాజెక్టు మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రాజెక్టు రివిట్మెంట్ మరమ్మతుల కోసం రూ. 16 కోట్లు కేటాయిస్తూ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదల కావడంతో ప్రాజెక్టు మరమ్మతు పనులకు మార్గం సుగమమైంది. తెలంగాణ ప్రభుత్వం నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతోపాటు ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తుండటంతో రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా పోతున్నాయి.