యాదాద్రి భువనగిరి : అక్రమంగా నిల్వ ఉంచిన రూ.6 లక్షలు విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను మంగళవారం ఎస్వోటీ పోలీస్లు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించారు. పోలీసుల కథనం మేరకు..మండలంలోని ముల్కలపల్లిలోని ఓ ఇంట్లో భారీగా నిషేధిత గుట్కాలు నిల్వ ఉంచారనే సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.6లక్షలు విలువైన వివిధ రకాల నిషేధిత గుట్కాప్యాకెట్లతో పాటు బైకు, ఫోన్ సీజ్ చేయడంతో పాటు సంబంధిత ఇద్దరు వ్యక్తులు చిన్నం శ్రీశైలం, గుండెబొయిన మల్లేశ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి