దళిత సాధికారత పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రూ.1200 కోట్లతో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం కింద మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 119 నియోజకవర్గాల్లోని 11,900 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రైతుబంధు పథకం మాదిరిగానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.