హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బీమా వయసు, స్లాబులను సవరిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ బీమా వయసును 53 ఏండ్ల నుంచి 56 ఏండ్లకు పెంచింది. కనిష్ఠ బీమా వయసు 21 నుంచి 19 ఏండ్లకు తగ్గించింది. కనిష్ఠ ప్రీమియం స్లాబును రూ. 500 నుంచి 750కి.. గరిష్ఠ ప్రీమియం స్లాబును రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచింది.