ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 5: సిద్దిపేటలోని కేసీఆర్ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కొనియాడారు. సోమవారం ఆయన కేసీఆర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని సందర్శించారు. హైదరాబాద్లాంటి నగరాల్లో ఉన్న విలాసవంతమైన అపార్ట్మెంట్ల మాదిరిగా ఈ ఇండ్లు ఉన్నాయన్నారు. ఫంక్షన్హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టు చెప్పారు.