హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభు త్వం అనుసరిస్తున్న వ్యా పార అనుకూల విధానాలతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పెరుగుతున్నాయని యూఎస్ కా న్సుల్ జనరల్ జోయెల్ రిఫ్మన్ ప్రశంసించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర నికర విలువ జోడింపు (నెట్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్.. ఎన్ఎస్వీఏ)లో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం వేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా ము న్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అభినందనలు తెలిపారు. దీనికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు.