ఎమ్మెల్యే కోరుకంటి చందర్
రూ.70 లక్షలతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల ప్రారంభం
జ్యోతినగర్, మే 9: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధిని కేరాఫ్ అడ్రస్గా మారుస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీపీసీ పట్టణం మూడో డివిజన్లోని అన్నపూర్ణకాలనీ, న్యూపోరట్పల్లిలో మున్సిపల్ నిధులు దాదాపు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పట్టణాల సుందరీకరణ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి మున్సిపాలిటీలకు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. వీటితో రామగుండంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామగుండం నగరపాలక మేయర్ డాక్టర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, నాయకులు కుమ్మరి శారద, తూం పద్మ, బుర్ర శంకర్గౌడ్, మెట్టుపల్లి అనిల్రావు, పిట్ట సమ్మయ్య, భరత్ గౌడ్, ఈదునూరి శంకర్, వంశీ, వీరాలాల్, చందు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు
మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటికి అందిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్టీపీసీ పట్టణం నాలుగో డివిజన్లోని మిషన్ భగీరథ తాగునీటి నల్లా కనెక్షన్ను ప్రారంభించి మాట్లాడారు. మిషన్ భగీరథ నీటిపై కొందరు చేస్తున్న అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు. అనంతరం అదే కాలనీకి చెందిన ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు కల్వల బుచ్చయ్య ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని వినతి
సింగరేణి మేడిపల్లి ఓసీపీ-4 ప్రభావిత గ్రామం మేడిపల్లిలోని దళిత కాలనీకి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని గ్రామ దళితులు ఎమ్మెల్యేను కోరారు. ఈ మేరకు డివిజన్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఇక్కడ న్యూపోరట్ వాసులు సానపురి శ్రీనివాస్, కాలనీవాసులు ఉన్నారు.
పేదలకు ఆపన్నహస్తం సీఎంఆర్ఎఫ్
గోదావరిఖని, మే 9: అనారోగ్యం పాలైన పేదలను సీఎంఆర్ఎఫ్ ఆపన్నహస్తంలా ఆదుకుంటున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని ఆయన నివాసంలో పాలకుర్తి గ్రామానికి చెందిన మాదాసు చంద్రయ్యకు రూ.3.60 లక్షలు, మేరుగు పద్మకు రూ.26వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ హాస్పిటళ్లలో చేరి చికిత్స చేయించుకున్న పేదలకు సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉదారంగా సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.