న్యూయార్క్ : భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా అల్బేనియాకు తొలిసారి అవకాశం దక్కింది. అల్బేనియాతోపాటు మరో నాలుగు దేశాలను కూడా భద్రతా మండలి సభ్యులుగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎన్నుకున్నది. భద్రతా మండలికి ఎన్నికైన దేశాలలో ఘనా, అల్బేనియా, బ్రెజిల్, గాబన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఐరాస సర్వసభ్య సమావేశంలో ఓటు వేసిన తర్వాత ఈ దేశాలన్నీ ఎంపికయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ దేశాల పదవీ కాలం ప్రారంభమై.. 2023 డిసెంబర్ 31 వరకు కొనసాగుతాయి.
ఐక్యరాజ్యసమితి అందజేసి సమాచారం ప్రకారం, భద్రతా మండలిలో ఘనాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఘనాకు 185, గబోన్కు 183, బ్రెజిల్ 181, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 179, అల్బేనియాకు 175 ఓట్లు వచ్చాయి. భద్రతా మండలిలో బ్రెజిల్ 10 సార్లు, గాబన్, ఘనా మూడుసార్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకసారి శాశ్వత సభ్యదేశంగా ఉన్నారు. ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే కూడా భారతదేశంతో పాటు ఈ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యులుగా ఉన్నాయి. భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉండగా.. వీరిలో ఐదుగురు శాశ్వత సభ్యులు కాగా, పది మంది ఓటింగ్ ద్వారా ఎన్నికైనవారు ఉంటారు. యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, చైనా, రష్యా, బ్రిటన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా మారడానికి యూఎన్ జనరల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. దీని కోసం రహస్య బ్యాలెట్ నిర్వహిస్తారు.
చర్చలు షురూ: జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఉపహార్ అగ్నిప్రమాదంలో 59 మంది మృతి
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..