ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్టు చైర్మన్ గంజి రాజమౌళిగుప్తా
రవీంద్రభారతి, ఏప్రిల్ 4: తెలంగాణలోని అగ్రవర్ణ కులాల పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్టు చైర్మన్ గంజి రాజమౌళిగుప్తా అన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. అగ్రవర్ణ పేదల సంక్షేమానికి 10 శాతం రిజర్వేషన్లను చట్టంగాచేసి దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనం కలిగించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుచేస్తూ జీవో జారీచేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుస్స శ్రీనివాస్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ప్రధాన కార్యదర్శి పండగంటి రమేశ్, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు గోపు జైపాల్రెడ్డి, రామారావు, గంజి స్వరాజ్యబాబు, తాడిశెట్టి పశుపతి, దుబ్బ శ్రీనివాస్, రమణయ్య, ఉపేందర్, శారద తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి