వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్
కరోనా కష్టకాలంలోనూ ధాన్యం కొనుగోలు
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
కొనుగోళ్లకు సహకరించిన అధికారులకు సన్మానం
సత్తుపల్లి, జూన్ 22: వ్యవసాయం దండగ కాదని, పండుగ అని నిరూపించి రైతుల పక్షాల నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సహకరించిన అధికారులను సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యాసంగిలో జిల్లాలోనే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచే ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. సేకరణలో జాప్యం జరిగినప్పటికీ కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు ఎంతో శ్రమించి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి ఇతర జిల్లాలకు ఎగుమతి చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో పామాయిల్ సాగు విస్తరిస్తోందని, నాణ్యమైన ధర ఉండడంతో రైతులు కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సహకరించిన అదనపు కలెక్టర్ మధుసూదన్రావు, డీఆర్డీవో విద్యాచందన, డీఏవో విజయనిర్మల, డీసీవో విజయకుమారి, డీఎస్వో రాజేందర్, డీఎం సోములు, ఏపీఎం నర్సింహారావు, సివిల్ సప్లయి డీటీ రవి, ఏడీఏ నర్సింహారావు, ఏసీపీ వెంకటేశ్, సీఐ రమాకాంత్లను సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్లు గొర్ల సంజీవరెడ్డి, చల్లగుళ్ల కృష్ణయ్య, నాయకులు వెల్ది జగన్మోహనరావు, గాదె సత్యం, సొసైటీ అధ్యక్షులు మామిళ్లపల్లి కృష్ణయ్య, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, తుమ్మూరు శ్రీరామప్రసాద్, చిలుకుర్తి కృష్ణమూర్తి, సొసైటీ సీఈవోలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.