ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే ఉప్పెన సినిమాతో అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ ను ఓ అంశం కలవర పెడుతుంది. అతని పేరుతో పలు ఫేక్ అకౌంట్స్ క్రియేట్స్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం వైష్ణవ్ తేజ్ దృష్టికి వెళ్లడంతో అఫీషియల్ ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేశారు.
నాకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్స్ లేవు. దయచేసి ఫేక్ అకౌంట్స్ ఫాలో కావొద్దు, అందులో ఉన్న సమాచారం అస్సలు నమ్మవద్దు. అలాంటి ఖాతాలపై వెంటనే రిపోరట్ చేయండి. ఇలాంటి వాటి పట్ల అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను అని వైష్ణవ్ తేజ్ స్పష్టం చేశారు. కాగా, వైష్ణవ్ తేజ్.. క్రిష్ జాగర్లమూడితో ఓ సినిమా చేయగా, ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. అలాగే, అక్కినేని నాగార్జున నిర్మాణంలో నటించేందుకు సంతకం చేసిన వైష్ణవ్.. , ‘జాతి రత్నాలు’తో భారీ హిట్ అందుకున్న అనుదీప్ కేవీతోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.