హుజూరాబాద్ : ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు జమ్మికుంట మండలంలో తెలంగాణ ధూం.. ధామ్.. నిర్వహించనున్నారు. మండల పరిధిలోని నగురం, నాగరం గ్రామాలను కలిపి వావిలాల వేదికగా ప్రముఖ గాయకుడు సాయిచంద్ బృందంచే ధూం.. ధామ్.. నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట రూరల్ ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ధూం.. ధామ్.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.