హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు .. వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ పరిధిలో రైల్వే ట్రాక్పై శవమై తేలాడు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుడి శరీరంపై ఉన్న పచ్చబొట్టు ద్వారా ఆ వ్యక్తి అత్యాచార నిందితుడిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. మృతుడి చేతిపై మౌనిక అని పచ్చ బొట్టు రాసి ఉన్న గుర్తు ద్వారా అతన్ని రేప్ నిందితుడు రాజుగా తేల్చినట్లు డీజీపీ తన ట్వీట్లో చెప్పారు.