హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రజల సహకారం పూర్తిగా ఉన్నదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు ప్రజలు ఇండ్లకే పరిమితమవ్వాలని ఆయన సూచించారు. ఇక అంతరాష్ర్ట సరిహద్దుల్లో ఈ-పాసులు ఉంటేనే అనుమతి ఉంటుందని తేల్చిచెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే అంబులెన్స్లు, ఆస్పత్రులకు వచ్చే వాళ్లకు ఈ-పాసులు అక్కర్లేదని స్పష్టం చేశారు. తెలంగాణ పరిధిలో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన వారికి కూడా పాసులు అక్కర్లేదని తెలిపారు. సీపీలు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. అత్యవసర సర్వీసులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.