హైదరాబాద్ : కొవిడ్ టీకాల కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల కొవిడ్ టీకాలు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో సాయంత్రానికి 5.66 లక్షల డోసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం లక్షకుపైగా టీకాలు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న టీకాలు కేవలం 3 రోజులకు మాత్రమే సరిపోతాయని, వెంటనే రాష్ట్రానికి టీకాలు పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎస్ కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి