హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ): చేసిందే తప్పు.. పైగా దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దొంగ వేషాలు వేస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్పై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. శనివారం హుజూరాబాద్లో విలేకరులతో ఈటల మాట్లాడిన మాటలపై ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇన్నేండ్లు ఖ్యాతి, గౌరవం, హోదా అనుభవించి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజల ఆత్మగౌరవం అంటూ తన ఆస్తుల రక్షణకు వెంపర్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈటల మాటలకు తూటాల్లాంటి ఎదురు ప్రశ్నలు, సమాధానాలతో చెంప చెల్లుమనిపించే రిైప్లె ఇచ్చారు.