అమరావతి : కరోనా బారినపడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
ఆయన త్వరలోనే పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
అదేవిధంగా రేపు తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన కోరారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రజలు, కార్యకర్తల క్షేమమే తనకిచ్చే జన్మదిన కానుక అని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి