హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన మరికాసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ భేటీలో.. లాక్డౌన్, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోత, జలవిద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నారు. కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్డౌన్ విధించటంతో ప్రస్తుతం కొత్త కేసులు చాలావరకు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో శనివారం వరకు ఉన్న లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగించాలా? లేదా మరిన్ని సడలింపులు ఇవ్వాలా అనేఅంశపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నది. కరోనా మూడో వేవ్ గురించి వస్తున్న సమాచారాన్ని కూడా మంత్రివర్గభేటీలో చర్చించే అవకాశం ఉన్నది.