గ్వాలియర్ : యూనివర్సిటీలో నీలిచిత్రాలు చూసేందుకు యత్నించిన ఐదుగురు సిబ్బందిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఓ శాశ్వత ఉద్యోగికి షోకాజ్నోటీసులు జారీ చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లోని జీవాజీ యూనివర్సిటీలో పనిచేసే ఐదుగురు తాత్కాలిక సిబ్బంది రెండురోజుల క్రితం కార్యాలయం కంప్లూటర్ల ద్వారా నీలిచిత్రాలను డౌన్లోడ్ చేసేందుకు యత్నించారు.
సర్వర్ల సెక్యూరిటీ కారణంగా ఈ ప్రయత్నం విఫలమైందని యూనివర్సిటీ పీఆర్ఓ తెలిపారు.
అవుట్ సైడ్ ఏజెన్సీ నుంచి నియమించుకున్న నలుగురు ఉద్యోగులు, కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన గెస్టు లెక్చరర్ నేరంలో పాల్పంచుకున్నట్లు గుర్తించారు.
వీరిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.