తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 2: ప్రజలు సహకరిస్తే పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ అన్నారు. కలెక్టర్ హరీశ్ సూచన మేరకు శుక్రవారం వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మోహన్తో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పను లు, మౌలిక వసతులపై ప్రజల నుం చి అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి పనులకు సంబ ంధించిన వివరాలు, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, కలెక్టర్కు సమర్పించి నిధులను మం జూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఐ రమేశ్, పట్టణ కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్, భగవాన్రెడ్డి,రాజు,టీఆర్ఎస్ నాయకులు రఘుపతి పాల్గొన్నారు.