హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా ఉధృతి దృష్ట్యా లాక్డౌన్తో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. కరోనాకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుపై చర్చించనున్నారు. టీకాలు, వ్యాక్సిన్లు, ఔషధాల కొరత అధిగమించడం, ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై కూడా చర్చించనున్నారు.