హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ( TS Cabinet )ప్రారంభమైంది. ఈ సమావేశంలో దళిత బంధుపై చర్చించే అవకాశం ఉన్నది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. వీటితోపాటు గత క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించనున్నారు.