హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ సడలింపుతో టీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల వేళల్లో మార్పు చేసింది. రేపటి నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బస్సులను నడపనున్నారు. గ్రేటర్ పరిధిలోని బస్పాస్ కౌంటర్లు ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు కల్పించింది. మరో పది రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది.