హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను శనివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శామీర్పేటలో న్యాయవాదుల శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని సీజేఐ ఎన్వీ రమణను బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి కోరారు. రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజన్భవన్లో శనివారం సీజేఐకి గౌరవ విందు ఏర్పాటు చేశారు. విందుకు సీఎం కేసీఆర్ సైతం హాజరైన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.