హైదరాబాద్: తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘వికార నామ సంవత్సరం.. పేరుకు తగ్గట్టు వికృతంగా నాట్యం చేసింది. శార్వరి నామ సంవత్సరం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టింది. ఇప్పుడు వచ్చింది ప్లవ నామ సంవత్సరం. ప్లవ అంటే దాటించునది అని అర్థం.. “దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం…….” దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం’ అని తెలిపారు.
ఈ ప్లవ నామ సంవత్సరంలో ప్రజల కష్టాలు తీరిపోయి, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు
మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్
సాగర్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం: మంత్రి తలసాని