హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 24వ తేదీన ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశమై అసెంబ్లీ ఎజెండాను ఖరారు చేయనుంది.