ఆయుష్ మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: మలేరియాను తగ్గించడానికి 40 ఏండ్ల క్రితం తయారు చేసిన ‘ఆయుష్-64’ ఔషధం కరోనా చికిత్సలో ఉపయోగపడుతుందని ఆయుష్ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. లక్షణాలు లేని, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి ఈ ఔషధాన్ని వాడవచ్చని పుణెలోని సెంటర్ ఫర్ రుమాటిక్ డిసీజెస్ డైరెక్టర్ అరవింద్ చోప్రా చెప్పారు. ఆయన ఆయుష్-సీఎస్ఐఆర్ మధ్య వైద్యపరమైన సమన్వయాధికారిగా ఉన్నారు. ఈ ఔషధంపై మూడు దవాఖానల్లో 210 మందిపై ప్రయోగాలు నిర్వహించామన్నారు.