హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సెప్టెంబర్ 24న సమావేశాలు ప్రారంభంకాగా, వర్షాల కారణంగా మూడ్రోజులపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. వాయిదాపడిన అంశాలను, బిల్లులను, చర్చను తిరిగి ఎప్పుడు చేపట్టాలనేది స్పీకర్ నిర్ణయిస్తారని అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి.